17, ఫిబ్రవరి 2010, బుధవారం

వసుచరిత్రవైచిత్రి

సభకు ఆహ్వానం డా|| జక్కు రామకృష్ణగారు పలుకుతూ, అధ్యక్షులైన ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. రాజు గారిని, ఆయన శ్రీ సాగిశివసీతారామరాజు కళాపీఠంచే చేస్తున్న సేవను, ఇతర సంస్థలకు అందిస్తున్న సహాయాన్ని, ముఖ్యంగా పుస్తక ప్రచారానికి ఆయన చేస్తున్న కృషిని శ్లాఘించారు. వక్త శ్రీ కోటారావుగారిని ఆహ్వానిస్తూ, కవిగా, విమర్శకునిగా కృషిని కొనియాడుతూ మేలి జాతిరత్నంగా అభివర్ణించారు. ఆశుపద్య రచనలో ఆయన ప్రతిభ ద్వారా, భువనవిజయం లో తిమ్మరసుగా, ఆయన సుపరిచితులని గుర్తుచేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ గారిని ఆహ్వానిస్తూ, స్వర్గీయ మోహన్ గారి దీప్తిని కొనసాగిస్తున్న ఆమె కృషిని అభినందించారు. అనంతరం శ్రీ కాగుపాటి నారాయణరావు గారు ప్రార్థన చేశారు. అధ్యక్షులు శ్రీ రాజు గారు మాట్లాడుతూ విజయభావన తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. విజయభావనను సాహిత్యానికి యూనివర్సిటీగా పేర్కొన్నారు. సాహిత్యం ద్వారా విలువలు పెరుగుతాయన్నారు. అందుకే పుస్తకపఠనాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీకుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. పుస్తక ప్రచురణ, ప్రదర్శన కొరకై తమ సంస్థ చేస్తున్న పనులను వివరించారు. పుస్తకాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడానికి చేయవలసిన సూచనలు చేశారు. తమకు పుస్తకాలను సగం ధరకు అమ్మినవాళ్ళకు, తమదగ్గర సగం ధర ఇచ్చి కొన్న వాళ్ళకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ మాట్లాడుతూ భాషాపరిజ్ఞానానికి ప్రబంధ పఠనం అవసరం అని, రామరాజ భూషణుని వసుచరిత్ర అత్యుత్తమమైన రచన అని తెలిపారు. అనంతరం శ్రీ కోటారావుగారిని సమ్మానించారు. సమ్మానంతరం ‘వసుచరిత్ర వైచిత్రి’ పై శ్రీ కోటారావుగారు ప్రసంగిస్తూ, విజయనగరంలో తను చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ తనకు కనువిప్పు ఇక్కడే కలిగిందిఅని చమత్కరించారు. విజయభావనలో మాట్లాడితే ఒక తృప్తి ఉంటుంది అని, ఎప్పుడు ఆదేశించినా వస్తానని తెలిపారు. శ్రీ శారదా ప్రసాద్ గారు వందన సమర్పణ చేశారు.
ప్రసంగ సారాన్ని పద్యం.నెట్ లో పొందుపరుచుట జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి